క్రెడిట్ అంతా బాబుదే: టీడీపీ

-

దుర్గగుడి నూతన ప్లై ఓవర్ ను సందర్శించారు టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమ. భవానీ పురం నుంచి రాజీవ్ గాంధీ పార్క్ వరకు పైవంతెనపై కాలినడకన ఆయన వంతెనను పరిశీలించారు. చంద్రబాబు కృషి ఫలితమే దుర్గగుడి ప్లై ఓవర్ నిర్మాణం పూర్తై ప్రజలకు అందుబాటులోకొచ్చింది అని ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. దుర్గగుడి ప్లై ఓవర్, బెంజ్ సర్కిల్ ప్లై ఓవర్ల నిర్మాణంపై చంద్రబాబు దృష్టిసారించడంతోనే ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఆయన అన్నారు.

తెలుగుదేశం ఎప్పుడూ కూడా ప్రజా ఆకాంక్షలకనుగుణంగా, వారి శ్రేయస్సు కోసమే పనిచేస్తుందనేది ఈ ప్లై ఓవర్ల ఫలితంతోనే మరోసారి రుజువైందని ఆయన పేర్కొన్నారు. విజయవాడ ప్రజలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేళ్లేవారికి ట్రాఫిక్ కష్టాలు కొంతమేరకు తీరినట్టే అని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news