అల్లరి నరేష్” ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” ఫస్ట్ లుక్ రిలీజ్..

-

నాంది తర్వాత అల్లరి నరేష్ నుంచి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. నాంది సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాదు నటుడిగా నరేష్ కు చాలా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఏఆర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో అల్లరి నరేష్ సరసన ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా గురించి మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర బృందం.

అల్లరి నరేష్ 59 వ చిత్రం గా వస్తున్న ఈ మూవీని హాస్య మూవీస్ మరియు జి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా అబ్బూరి రవి డైలాగ్స్ రాస్తుండగా, శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కాగా నాంది చిత్రం తో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు హీరో అల్లరి నరేష్.ప్రస్తుతం ఆయన చేతిలో మరో సినిమా ఉంది.అదే “సభకు నమస్కారం” ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news