బీఆర్ఎస్ తో పొత్తు అంటే చెప్పుతో కొట్టండి: ఎంపీ బండి సంజయ్

-

తెలంగాణలో మరి కొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించింది. తమకు ఎంతో కలిసొచ్చిన రథయాత్ర పేరిట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్రులకు బీజేపీ శ్రీకారం చుట్టింది. రాష్ట్రమొత్తాన్ని లోక్ సభ నియోజకవర్గాల వారీగా 5 క్లస్టర్లుగా విభజించి…ఒక్కో క్లస్టర్ కు ఒక రథాన్ని పంపింది. ఈ విజయసంకల్ప రథం..ఆయా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనుంది. ఈ ప్రచార రథాలను నిన్న చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కిషన్ రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే…..తాండూరులో విజయ సంకల్ప సభలో పాల్గొన్నా ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ…..బీజేపీకి బీఆర్ఎస్కు పొత్తు ఉండదని స్పష్టం చేశారు.ఎవరైనా పొత్తు ఉందని అంటే చెప్పుతో కొట్టాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీని నాశనం చేసేందుకే బీఆర్ఎస్ పుట్టిందని.. కేసీఆర్వి లుచ్చా రాజకీయాలని విమర్శించారు. కొంపలు ముంచేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నారని, ఆయనకు అపాయింట్మెంట్ ఎవరూ ఇవ్వరన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news