ఇలా ఉండే ఆహారాన్ని అస్సలు తీసుకోకండి… ఎందుకంటే…?

-

సహజంగా మనం బయటకొనే ఆహార పదార్ధాలలో వెండి రంగు లో ఉండే కాగితంని ఉపయోగిస్తారు. బేకరీ ఉత్పత్తులు, చికెన్ కబాబ్స్‌, లెగ్ పీస్‌లు, తందూరీ రోటీ ఇలా అనేక ఆహార పదార్ధాలని మనం అల్యూమినియం ఫాయిల్ లో చుట్టి ఇవ్వడం చూస్తాం. మరి ఆ అల్యూమినియం ఫాయిల్ వల్ల మనకి ఏమైనా నష్టాలూ కలుగుతాయా…? మరి దాని కోసం ఇప్పుడే పూర్తిగా తెలుసుకోండి.

దీని వాడకం రోజు రోజుకి పెరిగిపోతోంది. దీనిని ఎలా తయారు చేస్తారంటే..? ఈ లోహాన్ని కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో ప్రాసెసింగ్ చేయడం ద్వారా ఆ ఫాయిల్‌ను రూపొందిస్తారు. ఇలా చేసిన ఆ అల్యూమినియం ఫాయిల్ ని చుట్టబడి ఉన్న ఆహారాన్ని తింటే ఆరోగ్యానికి చాలా ప్రమాదం కలుగుతుంది. ఈ విషయం గురించి క్లుప్తంగా చూస్తే… అల్యూమినియం ఫాయిల్ చుట్టబడి ఉన్న కొన్ని ఆహార పదార్థాలపై ల్యాబొరేటరీలో చాలా ప్రయోగాలు చేశారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌, ఈజిప్ట్ దేశాలకు చెందిన కొంత మంది సైంటిస్టులు. అయితే చేసిన ఆ పరిశోధనలో తేలినది ఏమిటంటే… ఆహార పదార్థాలకు చుట్టడం వల్ల దానిలో నుంచి కొన్ని అల్యూమినియం అణువులు స్వల్ప మోతాదులో ఆహారంలో కలుస్తున్నాయట.

దీని కారణంగా ప్రమాదం కలుగుతుంది. ఇది అల్జీమర్స్‌, ఎముకల సంబంధ వ్యాధులు, మూత్రశాయ అనారోగ్యాలు, మెదడు కణాల పనితీరు దెబ్బతినడం ఇలా కొన్ని రోగాలకు దారితీస్తుంది. అల్యూమినియం ఫాయిల్స్‌ను ఎక్కువగా వాడితే పైన చెప్పిన వ్యాధులు దీర్ఘకాలంలో వస్తాయట. కనుక దీనిలో దృష్టిలో పెట్టుకుని వీటికి బదులుగా వేరే పద్ధతులని అనుసరించడం మేలు. ఒకవేళ మీరు కనుక ఈ ఫాయిల్స్ ని రెగ్యులర్ గా వాడుతుంటే ఈ అలవాటుని మార్చుకోండి. లేదంటే మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త..!

Read more RELATED
Recommended to you

Latest news