మాజీ లవర్ పై కేసు పెడతానంటున్న అమలాపాల్…!

-

తెలుగుతమిళ భాషల్లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజుకు ప్రయత్నించింది అందాల అమలాపాల్. సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే దర్శకుడు ఎ.ఎల్.విజయ్ ని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆతర్వాత కొంతకాలానికే వీళ్ళ పెళ్లి విడాకులకు దారితీసింది. మనస్పర్థలు రావడంతో ఇద్దరు విడిపిపోయారు. ఆతర్వాత మళ్ళీ సినిమాల్లో బిజీ అయిపోయిన అమల ఆతర్వాత మరొకరితో ప్రేమాయణం మొదలు పెట్టిందని వార్తలు గుప్పుమన్నాయి. ముంబైకి చెందిన గాయకుడు భవీంధర్ సింగ్ తో అమ్మడు ప్రేమలో తేలిపోతుందని కూడా వార్తలు వినిపించాయి..అయితే ఈ ఇద్దరు చెప్పాపెట్టకుండా పెళ్లికూడా చేసుకున్నారని వార్తలు షికారు చేసాయి.

ఆ మధ్య ఈ ఇద్దరికి సంభందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇది కాస్తా సంచలనంగా మారడంతో భవీంధర్ సింగ్ఆ ఫోటోలను సోషల్ మీడియానుంచి తొలగించాడు. ఆ తరువాత వాటిపై స్పందించిన అమలాపాల్.. పెళ్లి వార్తల్లో ఎలాంటిే నిజం లేదని కొట్టిపారేసింది. ఇది జరిగి చాలా కాలం అయింది. ఇప్పుడు ఈ అమ్మడు ఆ సింగర్ పై కేసు వేసింది. చెన్నై కోర్టులో తన ఫొటోలను అనుమతి లేకుండా వాడటంతో పాటు పెళ్లైందంటూ పుకార్లు సృష్టించిన భవిందర్ పై పరువు నష్టం కేసు వేయడానికి అనుమతి ఇవ్వాలని అమలాపాల్ కోరింది.ఈ క్రమంలో న్యాయస్థానం భవీందర్ కు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఇన్నాళ్ల తర్వాత అమలాపాల్ ఆ విషయం మీద రియాక్ట్ కావడం పై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. మరి ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news