రాజధానిలో పర్యటించాలంటే చంద్రబాబు క్షమాపణ చెప్పాలి.. ఎందుకంటే..?

-

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 28వ తేదీన అమరావతిలో పర్యటించనున్నారు. అయితే నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పర్యటించాలంటే దళితులకు క్షమాపణ చెప్పాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం రాజధాని రైతుల్లో మరో వర్గం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాజధానికి టీడీపీ నేతలెవరూ భూములు ఇవ్వలేదన్నారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు 9 వేల ఎకరాలు కొన్నారని రైతులు ఆరోపించారు. ‘మాకు ఇచ్చిన ప్లాట్ల మధ్యలో 25 లక్షల గజాలు ఎందుకు హోల్డ్‌లో పెట్టారో చంద్రబాబు చెప్పాలి..?. మూడేళ్లలో ప్లాట్లను అభివృద్ధి చేస్తామన్నారు.. ఎందుకు చేయలేదు?. అసైన్డ్ భూములకు ఎందుకు తక్కువ ప్యాకేజీ ఇచ్చారు.

రాజధాని ఇక్కడే ఉండాలనేది మా కోరిక’ అని రాజధాని రైతుల్లో మరో వర్గం చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే.. తమకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వరంటూ దళిత రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. దళితరైతులు మాట్లాడుతుండగా వెనకనుండి కంట్రోల్ చేయడం ఏంటి..? అని రాజధాని రైతుల్లో మరో వర్గం ప్రశ్నించింది.

Read more RELATED
Recommended to you

Latest news