చంద్రబాబు పాపాల వల్లే పోలవరంకు ఈ దుస్థితి: మంత్రి అంబటి రాంబాబు

-

ఈరోజు పోలవరం ప్రాజెక్టు పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఎంపీలు కోటగిరి శ్రీధర్, మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, ధనలక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో అంబటి మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నామని చెప్పారు. టీడీపీ హయాంలో కాఫర్ డ్యామ్ నిర్మించకుండానే డయాఫ్రం వాల్ నిర్మించారని విమర్శించారు.

పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని అన్నారు. చంద్రబాబు చేసిన పాపాల వల్లే పోలవరంకు ఈ దుస్థితి వచ్చిందని చెప్పారు. చంద్రబాబుకు ప్రచార యావ తప్ప మరేమీ లేదని అన్నారు. చంద్రబాబుకు ప్రచార యావ తప్ప మరొకటి లేదు. కాఫర్ డ్యాం నిర్మించకుండా డయాఫ్రం వాల్ నిర్మించారు. టీడీపీ హయాంలో పోలవరాన్ని సర్వనాశనం చేశారు. చంద్రబాబు చేసిన పాపాల వల్లే పోలవరానికి ఈ దుస్థితి” అంటూ మంత్రి అంబటి మండిపడ్డారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version