అత్యంత అవినీతి పార్టీ బీఆర్ఎస్.. సీఎం కేసీఆర్ పై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

-

నగరంలో గత కొంత కాలంగా స్కూల్ బస్సు కింద పడి చిన్నారులు మృతి చెందిన వార్తలు తరచుగా వెలుగు చూస్తున్నాము. ఈనెల ప్రారంభంలో హయత్ నగర్ లో ఓ మూడేళ్ల చిన్నారి అక్కను బస్సు ఎక్కించడానికి తాతయ్యతో కలిసి వచ్చి బస్సు కిందపడి మరణించారు. ఆ ఘటన మరవక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. సోదరుడిని స్కూల్ బస్సు ఎక్కించడానికి వచ్చిన మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు బస్సు కిందపడి మరణించింది. ఈ ఘటన హైదరాబాద్ లోని జవహర్ నగర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే భవిష్య అనే మూడేళ్ల చిన్నారి కుటుంబం హైదరాబాద్ లోని జవహర్ నగర్ ఆనంద్ నగర్ ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీలో నివాసం ఉంటుంది.

కాగా భవిష్య సోదరుడు రచన గ్రామర్ హై స్కూల్ లో చదువుతున్నాడు. కాగా ప్రతిరోజు లానే స్కూల్ కి వెళ్లేందుకు స్కూల్ బస్సు దగ్గరికి వస్తున్న సోదరుడితో కలిసి బస్సు దగ్గరికి వచ్చింది భవిష్య. ఈ క్రమంలో అనుకోకుండా ప్రదమాదవశాత్తు రచన గ్రామర్ హై స్కూల్ బస్సు ముందు చక్రాల కింద పడింది భవిష్య. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనను కారణం బస్సు డ్రైవర్ ప్రవీణ్ నిర్లక్ష్యమే అని స్థానికులు భావిస్తున్నారు. కాగా స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ సంఘటన గురించి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news