మరోసారి పెరిగిన అమూల్ పాల ధరలు… నేటి నుంచి కొత్త ధరలు అమలు

-

సామాన్య ప్రజలకు మరో షాక్. అమూల్, మదర్ డైరీ పాల ధరలు మళ్లీ పెరిగాయి. అమూల్ బ్రాండ్ పేరుతో పాలు, పాల ఉత్పత్తులను అమ్ముతున్న గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అమూల్ గోల్డ్, బర్రెపాల ధరను లీటర్ కు రూ. 2 చొప్పున పెంచినట్టు శనివారం ప్రకటించింది. ఫ్యాట్ ధరలు పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది.

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్ మినహా అన్ని ప్రాంతాల్లో పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు జిసిఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ సోథి వెల్లడించారు. మరోవైపు మదర్ డైరీ సైతం తమ పాల ధరను పెంచింది. ఢిల్లీ-ఎన్ సిఆర్ పరిధిలో ఫుల్ క్రీం పాలతో పాటు ఆవుపాల ధరను లీటర్ కు రూ. 2 చొప్పున పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ పెంపు ఆదివారం నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. దీంతో ప్రస్తుతం లీటర్ కు రూ.61 గా ఉన్న ఫుల్ క్రీం పాల ధర ఇకపై రూ.63 కు, ఆవుపాల ధర రూ. 53 నుంచి రూ. 55 కు పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news