బాలయ్య అభిమానులకు కిక్ ఇచ్చే అప్డేట్.. ఏంటంటే..?

-

సాధారణంగా సినీ ఇండస్ట్రీలోకి నటవారసులు ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నందమూరి కుటుంబం నుంచి ఎంతోమంది ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ , జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ విజయవంతంగా కెరియర్ ను కొనసాగిస్తూ పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. బాలయ్య చిన్న కూతురు తేజస్విని కూడా బాలయ్య అన్ స్టాపబుల్ షో కి క్రియేటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తూ.. సక్సెస్ సాధించే విషయంలో తన వంతు కృషి చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బాలయ్య చిన్న కూతురు , అల్లుడు ఇద్దరూ కూడా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబో బ్లాక్ బస్టర్ హిట్ కాంబో కాగా.. ఈ కాంబినేషన్లో తెరకెక్కనున్న మరో సినిమా 14 రీల్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. బాలయ్య చిన్నల్లుడు భరత్ ఈ సినిమాలో 20% పెట్టుబడి పెట్టి లాభాల్లో వాటా తీసుకోనున్నారని సమాచారం. మరొకవైపు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కూడా త్వరలో సినిమాలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆదిత్య 369 సీక్వెల్ ద్వారా ఆయన రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

అయితే ఈ సినిమాకు ఆదిత్య 999 మ్యాక్స్ పేరుతో ఈ సినిమా ఇప్పటికే పలు వార్తలు అయ్యాయి. ఈ సినిమాకి కూడా బాలయ్య చిన్న కూతురు తేజస్విని నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం. ఇకపోతే నందమూరి కుటుంబంలో ఇప్పటికే 11 బ్యానర్లు ఉండగా.. రాబోయే రోజుల్లో ఈ బ్యానర్ల సంఖ్య పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ఏమైనా ఈ విషయం బాలయ్య అభిమానులకు మంచి కిక్ ఇచ్చే అప్డేట్ అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version