సునీల్ ద‌ర్జాలో హీరోయిన్ గా రంగ‌మ్మ‌త్త..?

-

కమెడియన్ సునీల్ ప్రస్తుతం హీరోగా మరియు విలన్ గా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సునీల్ ప్రస్తుతం పుష్ప సినిమాలో ఓ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఇదే సినిమాలో అనసూయ కూడా ఓ పాత్రలో నటిస్తున్నట్టు తెలిసిందే. అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది. సునీల్ హీరోగా ద‌ర్జా అనే సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి హరీష్ శంకర్ కథను అందిస్తున్నారు.

14 రీల్స్ ప్ల‌స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో సునీల్ కు జోడీగా అనసూయ భరద్వాజ్ నటించబోతోందని టాక్. ఇప్పటికే ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ అన‌సూయ‌ను సంప్రదించారట. అనసూయ ఓకే చెబితే త్వరలోనే ఈ సినిమా ప‌ట్టాలెక్కే అవకాశం కూడా ఉందట. మరి అనసూయ ఓకే చెబుతుందా లేదా అన్నది చూడాలి. ఇదిలా ఉంటే అన‌సూయ క్యారెక్ట‌ర ఆర్టిస్ట్ గా న‌టించి విమ్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. అంతే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాతోనూ ఇటీవ‌ల ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది.

Read more RELATED
Recommended to you

Latest news