Acharya : ‘ఆచార్య’లో అనసూయదే కీ రోల్.. స్టోరిని మలుపు తిప్పే పాత్ర ఆమెదే!

-

టెలివిజన్ యాంకర్ గా ఉన్న అనసూయ భరద్వాజ్ ప్రజెంట్ సిల్వర్ స్క్రీన్ పైన కూడా సందడి చేస్తోంది. ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా ఆమె దూసుకుపోతున్నది. వరుసగా చిత్రాలు చేస్తూనే మరో వైపు బుల్లితెరపైన ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ నెల 29న విడుదల కానున్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ ఫిల్మ్ లోనూ అనసూయ కీ రోల్ ప్లే చేసింది.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ-చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేశాడు. వీరిరువురి కాంబినేషన్..అనగా తండ్రీ తనయులు.. చిరంజీవి-రామ్ చరణ్ లను వెండితెరపైన చూసేందుకు అటు మెగా అభిమానులు ఇటు సినీ లవర్స్ ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. అదేంటంటే.. ‘ఆచార్య’ స్టోరిని టర్న్ చేసే కీ రోల్ ను అనసూయ భరద్వాజ్ ప్లే చేసింది.

అనసూయ భరద్వాజ్ ఇప్పటి వరకు నటించిన సినిమాలన్నిటిలోనూ కీలక పాత్రలను పోషిస్తున్నది. ఈ క్రమంలోనే ‘ఆచార్య’లోనూ ఆమెకు వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇచ్చినట్లు టాక్. జనరల్ గా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నిటిలో ఉమెన్ క్యారెక్టర్స్ అన్ని చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి.

ఈ క్రమంలోనే ‘ఆచార్య’లో అనసూయ రోల్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని మెగా అభిమానులు అంటున్నారు. చూడాలి మరి అనసూయ పాత్ర ఎలా ఉండబోతుందో.. ఇప్పటికే ఈమె రామ్ చరణ్ కు రంగమ్మత్తగా ‘రంగస్థలం’లో, అల్లు అర్జున్‌కు దాక్షాయణి వదినగా ‘పుష్ప’లో నటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version