ఏపీలో కొత్త‌గా 1115 క‌రోనా కేసులు…19 మ‌ర‌ణాలు

-

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ఏపీని వదిలేలా కనిపించడం లేదు. ఆంధ్ర ప్రదేశ్‌ లో మొన్నటి వరకు పెరిగిన కరోనా కేసులు.. ఇప్పుడు తగ్గు ముఖం పడుతున్నాయి. తాజాగా నిన్నటి కంటే ఈ రోజు కాస్త పెరిగాయి కరోనా కేసులు. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,115 కరోనా కేసులు నమోదయ్యాయి.

ap carona
ap carona

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,14,116 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 19 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 13,857 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,693 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1,265 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 19,85,566 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 52,319 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2,66,29,314 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news