ఏపీలో భారీ తగ్గిన కరోనా కేసులు : కొత్తగా 1217 కరోనా కేసులు

-

చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి ఆంధ్ర ప్రదేశ్‌ ను వదలడం లేదు. మొన్నటి వరకు భారీగా పెరిగిన కరోనా కేసులు తాజాగా ఈ రోజు కాస్త తగ్గిపోయాయి. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1217 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,01,255 కి పెరిగింది.

ఒక్క రోజు వ్యవధిలో మరో 13 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 13,715 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 15, 141 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1535 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 61,678 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2,60, 34, 217 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 19,72, 399 లక్షలకు చేరింది.

 

Read more RELATED
Recommended to you

Latest news