రాహుల్‌ హత్య కేసు : ఐదుగురిపై కేసు నమోదు

-

విజయవాడ : రాహుల్‌ హత్య కేసు ఎఫ్‌ఐఆర్‌ లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఏకంగా ఐదుగురు పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు విజయవాడ పోలీసులు. రాహుల్‌ తండ్రి రాఘవరావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఐదుగురు నిందితులపై 302, 120 రెడ్‌ విత్‌ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎ1: కోరాడ విజయ్‌కుమార్, ఏ2: కోగంటి సత్యం, ఏ3: పద్మజ, .. ఏ4: పద్మజ, ఏ5: గాయత్రీ పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.

జిక్సిన్ సిలిండర్ల కంపెనీ వ్యవహారంలోనే వివాదాలు రాగా… తన 30శాతం వాటా ఇవ్వాలంటూ రాహుల్‌పై కోరాడ విజయ్ ఒత్తిడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. కోరాడ విజయ్ వాటాను కోగంటి సత్యంకు అమ్మేందుకు యత్నం జరిగినట్లు పోలీసులు కూపీ లాగారు. కోరాడ కుటుంబ సభ్యులకు నేరంలో భాగం ఉందని…ఎన్నికల్లో పోటీచేసి కోరాడ ఆర్థికంగా నష్టపోయాడని రాహుల్ తండ్రి పేర్కొన్నారు. కోరాడ విజయ్, కోరాడ పద్మజ, గాయత్రి, కోగంటి సత్యం బెరించారని…అత్యంత తక్కువ ధరకే కంపెనీ కావాలని సత్యం ఒత్తిడి చేశాడని రాహుల్ తండ్రి పోలీసులకు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news