Andhra Pradesh : DEO ఉద్యోగ నియామక పరీక్ష వాయిదా

-

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల కమిషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాలలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పరీక్ష వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 13న ఈ పరీక్ష జరగాల్సి ఉండగా.. మే 25కు వాయిదా వేస్తున్నట్లు APPSC సభ్యుడు పరిగె సుధీర్ తెలిపారు.

కాగా, ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఏప్రిల్ 19వ తేదీ నుంచి పోలింగ్ ప్రారంభమవుతుండగ,జూన్ 04న ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news