కాంగ్రెస్‌ను వీడిన సావిత్రి జిందాల్..ఏ పార్టీలో చేరారంటే ?

-

కాంగ్రెస్ పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది.దేశంలోనే అత్యంత ధనవంతమైన మహిళగా పేరు పొందిన సావిత్రి జిందాల్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆమె కుమారుడు, పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ ఇటీవల కాంగ్రెస్‌ని వీడి బీజేపీలో చేరారు.

బీజేపీ తరపున కురుక్షేత్ర నుంచి పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయనున్నారు. గత కొన్ని రోజుల కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో ఉంటున్న ఆమె,తాజాగా కుటుంబ సభ్యుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.

నిన్న కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించి గురువారం బీజేపీలో చేరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. “నేను హిస్సార్ నియోజకవర్గంలో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాను. హర్యానాకు కొన్నేళ్లు మంత్రిగానూ పని చేశాను. హిసార్ ప్రజలు నా కుటుంబం. నా కుటుంబ సభ్యుల సలహా మేరకు, నేను కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను” అంటూ ఎక్స్(ట్విట్టర్) లో పోస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news