టీడీపీలోకి గుంటూరు జడ్పీ చైర్ పర్సన్ క్రిస్టినా

-

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్నవేళ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా షాక్లు తగులుతూనే ఉన్నాయి. వైసీపీలో టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఇంకా నేతలు అలకపాన్పు దిగడం లేదు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన గుంటూరు జెడ్పీ చైర్పర్సన్ హెనీ క్రిస్టీనా అలకపాన్పు ఎక్కిన సంగతి తెలిసిందే.

గత నెలరోజులుగా జెడ్పీ చైర్పర్సన్ హెనీ క్రిఫ్టీనాతోపాటు ఆమె భర్త సురేశ్ కుమార్ సైతం వైసీపీకి అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు హెనీ క్రిస్టీనా దంపతులు రాజీనామా లేఖను విడుదల చేశారు. ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేసి హెనీ క్రిస్టీనా దంపతులు త్వరలోనే టీడీపీలో చేరనున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version