Andhra Pradesh:సీఎం చంద్రబాబు దృష్టికి గురుకుల సమస్యలు

-

రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు తొలిసారిగా ప్రారంభించారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు.బుధవారం విశాఖపట్నం జిల్లా సింహాచలం అడవివరం సమీపంలోని గురుకుల పాఠశాలలను సందర్శించిన ఆయన పాఠశాల పరిసరాలను పరిశీలించారు.

ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ… గురుకులలో విద్యార్థులకు అందిస్తున్న భోజన వసతులు బాగున్నాయని అన్నారు. అయితే గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన అదనపు భవనాలు ఇప్పటికీ నిర్మాణ దశలోనే ఉండిపోయాయని వీటి నిర్మాణాన్ని గత వైసిపి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందనిఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వాటి నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే గురుకులాల్లోని పలు సమస్యలను విద్యార్థులు సిబ్బంది తమ దృష్టి తీసుకువచ్చారని తెలిపారు. వాటిని సైతం పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.విద్యారంగానికి గతంలోనే టీడీపీ అధిక ప్రాధాన్యత ఇచ్చిందని.. అదే ప్రాధాన్యతను ప్రస్తుతం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.మరోవైపు సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం విశాఖపట్నం వస్తున్నారన్నారని ,ఈ సందర్భంగా గతంలో తాము ఇచ్చిన హామీలను ఆయన దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news