ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు షెడ్యూల్ విడుదల

-

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు షెడ్యూల్ విడుదలైంది. మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు ప్రకటన చేసింది. ఈ ఏడాది జంబ్లింగ్ విధానం లేకుండానే పరీక్షలు జరపనున్నట్లు పేర్కొంది. సెకండియర్ విద్యార్థులంతా ఇవాల్టి నుంచి తమ హాల్ టికెట్స్ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా సూచించింది బోర్డు.

కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ ఈ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. కాగా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశ పెడుతూ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఇటీవల ఏపీ హై కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరిగే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం నిర్వహించాలని… ఈ కాలేజీ విద్యార్థులకు ఆ కాలేజీ లోనే ప్రాక్టికల్స్ నిర్వహించాలని హైకోర్టు ఇంటర్ బోర్డు ఆదేశించింది. దీంతో మార్చి 11వ తేదీన ప్రారంభం కావాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి.

Read more RELATED
Recommended to you

Latest news