పవన్ మరియు చంద్రబాబు భేటీ… ఎన్నికలపై చర్చ

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు తన నివాసంలో టిడిపి అధినేత చంద్రబాబుతో సమావేశం అయ్యారు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో ఇద్దరు కొద్ది సేపటి క్రితం కలిశారు. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి వీరు చర్చించుకున్నట్లు సమాచారం .అలాగే ఏ అభ్యర్థికి ఎక్కడ టికెట్ కేటాయించాలో అనే విషయంతో పాటు ఎన్నికల ముందు రిలీజ్ చేసే మేనిఫెస్టో గురించి మాట్లాడుకున్నారు. ఈ భేటీ తర్వాత మరికొన్ని కీలక అంశాలు బయటికి వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఇది ఇలా ఉండగా …..ఇటీవల చంద్రబాబు అరెస్ట్ అయిన నేపథ్యంలో టిడిపి మరియు జనసేనలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇటీవలే చంద్రబాబుకి కంటి ఆపరేషన్ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన యొక్క నివాసానికి వెళ్లి కలిశాడు. ఆంధ్రప్రదేశ్లో రెండు నెలల ముందుగానే ఎలక్షన్స్ ఉన్నాయని జగన్ తెలిపాడు. దీంతో అప్రమత్తమైన ఇరువురు నాయకులు. వైసీపీ ని ఎలా ఢీకొట్టబోవాలనే అంశాలపై చర్చిస్తున్నారు. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన తెలంగాణ అసెంబ్లీలో కనీసం డిపాజిట్ దక్కించుకోలేని విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news