Mumbai : ముంబైలో ప్రభాస్ కోసం 120 అడుగుల కటౌట్….

-

ప్రభాస్ మరియు శృతిహాసన్ హీరో హీరోయిన్లు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్. ఈ చిత్రం 22 వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే ప్రభాస్ సంబంధించిన 120 అడుగుల కటౌట్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అయినటువంటి ముంబైలో ఏర్పాటు చేశారు. సలార్ కంటే ముందు కేజీఎఫ్ చిత్రానికి సంబంధించిన కటౌటును వంద అడుగులతో ఏర్పాటు చేశారు. ఈ సినిమా 2 గంటల 55 నిమిషాలు ఉండగా సెన్సార్ బోర్డు వారు A సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే ఈ సినిమాలో హింసకు సంబంధించిన సన్నివేశాలు మరియు రక్తపాతముకి సంబంధించిన సమావేశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

 


అయితే ఒక ఇంటర్వ్యూలో భాగంగా ప్రభాస్ ని తన పాత్ర షూట్ కోసం ఎంత సమయం తీసుకున్నారని అడగగా ప్రశాంత్ నీల్ హీరోల యొక్క డైరెక్టర్ అని తాను చాలా కంఫర్ట్ గా ఫీల్ అయ్యానని తెలియజేశాడు. ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ ,జగపతిబాబు మరియు ఈశ్వరి కుమారి ,శ్రియరెడ్డిలు తదితరులు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాని విజయ్ కిరింధర్ హాంబలే ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి రవి బస్రుర్ సంగీతాన్ని సమకూర్చగా భువన్ కుమార్ సినిమా ఆటోగ్రాఫర్ గా పనిచేస్తున్నడు.

Read more RELATED
Recommended to you

Latest news