సినిమా హీరోలంటే జగన్‌కు కుళ్లు.. చర్చలకు పిలిచి అవమానించారు: పవన్‌

-

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. కోరుకొండలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సినిమా హీరోలంటే జగన్ కు కుళ్లు అని, సినిమా టికెట్ల ధరల పెంపు విషంలో చర్చలకు పిలిచి మరి అవమానించారని విమర్శించారు.

లక్షలాది మంది అభిమానులు ఉన్న సినిమా హీరోలంటే సీఎం జగన్‌కు కుళ్లు అని .. అందరు సినీ హీరోల అభిమానులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని పవన్ కల్యాణ్ అన్నారు.  సినిమా టికెట్ల ధరల విషయమై సీఎం జగన్‌తో మాట్లాడేందుకు చిరంజీవి, ప్రభాస్‌, మహేశ్‌ వెళితే వారిని అగౌరవపర్చారని ఆరోపించారు. ప్రైవేటు మీటింగ్‌ జరుగుతుంటే.. శాడిస్టిక్‌గా సీక్రెట్‌ కెమెరాలు, మైక్‌లు పెట్టారని విమర్శించారు. చిరంజీవి అందరి తరఫున మాట్లాడితే.. ఆ వీడియోలను బయటకు రిలీజ్‌ చేసి అగౌరవపరిచారని ధ్వజమెత్తారు. “లక్షలాది మంది అభిమానులు గుండెల్లో పెట్టుకునే హీరోలంటే జగన్‌కు కుళ్లు, ముఖ్యంగా ప్రభాస్‌, మహేశ్‌బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ అభిమానులు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి’’ అని పవన్‌ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news