పోలవరాన్ని గోదావరిలో కలిపేసినందుకు సిద్ధమా జగన్..? : బాల క్రిష్ణ

-

జాబ్ క్యాలెండర్ పేరుతో ముఖ్యమంత్రి జగన్ నయవంచనకు గురిచేశారని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. విశాఖ కంచరపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. పసుపు అభివృద్ధికి సూచిక అని , ఉత్తరాంధ్ర గడ్డమీద అడుగుపెడితే చాలు పౌరుషం వస్తుందన్నారు బాలకృష్ణ. ఈ ప్రాంత ప్రజల గౌరవభిమానాలు అలా ఉంటాయని అన్నారు.పది రూపాయలు ఇచ్చి, మద్యం పదింతలు రేటు పెంచి అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రభుత్వాస్తులు తాకట్టు పెట్టిన ఘనత జగన్‌దని మండిపడ్డారు .

 

”సిద్ధం సిద్ధం సిద్ధం అంటున్నావ్.. దేనికి సిద్ధం బాబాయిని చంపినందుకా.. తల్లిని, చెల్లిని బయటికి గెంటేసావ్.. బాబాయి చంపిన వాడిని వదిలేసావు అని అన్నారు.నీ చెల్లికి సమాధానం చెప్పడానికి నువ్వు సిద్ధమా..? అని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేసి వారిని గంజాయి, డ్రగ్స్‌కి బానిసలు చేసావ్ వారికి సమాధానం చెప్పడానికి సిద్ధమా….? 3 రాజధానుల పేరుతో అమరావతి రైతులను నాశనం చేసి వారికి సమాధానం చెప్పడానికి సిద్ధమా…..? పెంచిన పన్నులు తగ్గించేందుకు సిద్ధమా…? పోలవరాన్ని గోదావరిలో కలిపేసినందుకు సిద్ధమా..?కల్తీ మద్యంతో తాళిబొట్లు తెంచావు వారికి సమాధానం చెప్పడానికి సిద్ధమా” అని బాలకృష్ణ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news