నాపై దాడి చేయాలని జగన్‌ కుట్రలు – రఘురామ

-

 

పార్లమెంటులో విశాఖపట్నం ఎంపీ ఎంవివి సత్యనారాయణ చేత తనపై దాడి చేయించాలన్నదే తమ పార్టీ పెద్దల ప్లాన్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు రఘురామకృష్ణ రాజు. జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విశాఖపట్నం రీజినల్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్న సుబ్బారెడ్డి గారి సూచనలతోనే పార్లమెంటు సెంట్రల్ హాల్లో సత్యనారాయణ తనను అసభ్య పదజాలంతో దూషించారని పేర్కొన్నారు.

పార్లమెంట్లో తనపై దాడి చేయించాలని, ప్రతిగా తాను కూడా ఆయనపై చేయి చేసుకుని ఉంటే తనపై స్థానిక పోలీసులతో కేసు పెట్టించి అరెస్టు చేయాలన్నది వారి కుట్రలో భాగమని తెలిపారు. గతంలోనూ ఎంపీ గోరంట్ల మాధవ్ చేత తనను దూషించేలా చేసి ఆయన్ని హత్య చేసి, ఆ హత్యా నేరాన్ని తనపై మోపాలని కుట్ర చేశారని, ఈ విషయాన్ని ముందే పసిగట్టిన తాను మీడియా ముఖంగా హెచ్చరించడం వల్లే గోరంట్ల మాధవ్ బ్రతికి పోయారని, ఇప్పుడు కూడా తనకు తెలిసిన కుట్ర కోణాన్ని వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాశానని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news