ఏలూరు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. జిల్లా కలెక్టరేట్ లో పని చేస్తున్న నలుగురికి కోవిడ్ పాజిటివ్ గా నమోదు ఐంది. దింతో హోం ఐసొలేషన్ లో నలుగురు ఉన్నారు. కలెక్టరేట్ లో పనిచేసే అందరికీ కరోనా పరీక్షలు చేశారు వైద్యులు.

4 రోజుల క్రితం శాంతినగర్ లో ఇద్దరు వ్యక్తులకు కోవిడ్ సోకింది. దింతో ఏలూరు జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. ఇక అటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. 2,700 కోవిడ్ కేసులు నమోదు కాగా, ఏడు మరణాలు నమోదు అయ్యాయి. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో తీవ్రత అధికంగా నమోదు అయ్యాయి. కేరళ-1,147, మహారాష్ట్ర-424, ఢిల్లీ-294 కేసులు నమోదు అయ్యాయి.