కేంద్ర పన్నుల్లో ఏపీకి రూ.49,364 కోట్లు

-

కొత్త ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో వాటా కింద ఏపీకి రూ. 49,364 కోట్లు, తెలంగాణకు రూ. 25,639 కోట్లు రానున్నట్లు బడ్జెట్ లో వెళ్లడైంది. 2023-24 కంటే ఏపీకి రూ. 4,666 కోట్లు, తెలంగాణకు రూ. 2,423 కోట్లు ఎక్కువ మొత్తం అందనుంది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన లెక్క ప్రకారం కేంద్ర పన్నుల్లో ఏపీకి 4.047%, టీఎస్ కు 2.102% వాటాను కేంద్రం పంపిణీ చేస్తోంది. దక్షిణ మధ్య రైల్వే లో కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ…ఈ ఏడాది 14,232.84 కోట్లు కేటాయింపు జరిగాయన్నారు.

భద్రాచలం రోడ్ డోర్నకల్ మధ్య 54.65 కిలోమీటర్ల డబ్లింగ్ లోనే పనులకు 770.12 కోట్లు, ఔరంగాబాద్ అంకై మధ్య డబ్లింగ్ పనులకు 960.64 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వే లో కొత్త ప్రాజెక్ట్ లకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. కొత్త ప్రాజెక్ట్ ల కింద 1184.14 కోట్ల కేటాయింపు, డబ్లింగ్, థర్డ్ లైన్ ప్రాజెక్ట్ కింద 2905.91 కోట్లు, విద్యుద్దికరణ లైన్ ల కోసం 225.59 కోట్లు, సిగ్నల్ టెలి కమ్యూనికేషన్ కింద 302.68 కోట్లు, రైల్వే భద్రత పరంగా నిదుల కేటాయింపులు 891.4 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version