మహిళా ఉద్యోగులకు 5 రోజుల క్యాజువల్ లీవ్ – సీఎం జగన్‌

-

మహిళా ఉద్యోగులకు 5 రోజుల క్యాజువల్ లీవ్ ఇవ్వనున్నట్లు ప్రకటన చేశారు సీఎం జగన్‌. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఉద్యోగులకు సీఎం జగన్ వరాల జల్లులు కురిపించారు. పెండింగ్ లో ఉన్న డీఏను దసరా కానుకగా అందిస్తామని ప్రకటించారు సీఎం జగన్‌. హెల్త్ విభాగంలో మహిళా ఉద్యోగులకు 5 రోజుల క్యాజువల్ లీవ్ ఇస్తామని కూడా ప్రకటించారు సీఎం జగన్‌. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎన్జీవోస్ సమావేశంలో సీఎం జగన్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మాదిరిగా తాము ఎవరికి అన్యాయం చేయలేదని… వారు పక్కన పడేసిన అనేక సమస్యలు పరిష్కరించామని తెలిపారు. ‘ఇచ్చిన హామీ మేరకు పదివేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామన్నారు. కాగా, కాలి మడమ నొప్పితో బాధ పడుతున్న సీఎం జగన్.. ఆస్పత్రికి వెళ్లారని సమాచారం. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎన్జీవోస్ సమావేశం అనంతరం పరీక్షలకు వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. విజయవాడ మొగల్రాజపురంలోని టెనెట్ డయాగ్నిస్ సెంటర్ కు వెళ్ళనున్నారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news