Apsrtc: దసరా కోసం ప్రత్యేకంగా 6100 ఆర్టీసీ బస్సులు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది ఆర్టీసీ సంస్థ.దసరా పండుగకు పది రోజుల సమయం ఉన్న నేపథ్యంలో… ప్రత్యేకంగా దసరా బస్సులను నడిపించనుంది. మొత్తం 6100 ఆర్టీసీ బస్సులను నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ.ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది.

Appointment of 3500 RTC drivers in AP

అక్టోబర్ 4వ తేదీ నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు ఈ స్పెషల్ ఆర్టీసీ బస్సులు… దసరా పండుగలు భాగంగా నడువనున్నాయని ప్రకటించింది ఆర్టీసీ సంస్థ. దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సంస్థ. ప్రత్యేకంగా దసరా కోసం వినియోగిస్తున్న ఆర్టీసీ బస్సులను…. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొంది. అటు తెలంగాణ ఆర్టీసీ సంస్థ కూడా ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను పెట్టే దిశగా అడుగులు వేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news