పిఠాపురంలో 86.33% పోలింగ్… పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమేనా ?

-

కాకినాడ జిల్లా పిఠాపురంలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు అయింది. ఈసారి 86.33% పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. 2014లో 79.44%, 2019లో 80.92% కాగా, ఈసారి దాదాపు 5% పెరిగింది. పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిసినప్పటి నుంచి అందరి దృష్టి పిఠాపురంపై పడింది. వైసిపి తరఫున వంగా గీత బరిలో నిలిచారు.

మరి జూన్ 4న వెలువడే ఫలితాల్లో విజయం ఎవరిదనేది ఆసక్తికరంగా మారింది. పిఠాపురం నియోజకవర్గంలో ఓటింగ్ శాతం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తాడని కూటమి సభ్యులు అనుకుంటున్నారు. అయితే తామే గెలుస్తామని వైసిపి ధీమాగా ఉంది. మరెవరు గెలుస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version