పిల్లలను కాపాడాలంటూ పోలీసులకు కుక్క రిక్వెస్ట్…వీడియో వైరల్‌

-

Ap Police : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మానవత్వం చాటుకున్నారు పోలీసులు. తన పిల్లలను కాపాడమని రోడ్డు మీద వెళ్లే వాహనాల వెంటపడి వేడుకుంది ఓ శునకం. దీంతో తల్లి వద్దకు ఆ కుక్కు పిల్లలను చేర్చారు పోలీసులు. ఈ సంఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వరద నీటిలో చిక్కుకున్న కుక్క పిల్లల కోసం తల్లి కుక్క ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ తరుణంలోనే… తన పిల్లలను కాపా డాలని వాహ నాలు, పోలీసుల చుట్టూ తిరుగుతున్న మూగజీవి ఆవేదనను గమనించిన పోలీసులు..ఓ ఇంట్లో కుక్క పిల్లలను గమనించి తల్లి వద్దకు చేర్చి మానవత్వం చాటుకున్నారు. ఆ నోరు లేని జీవి తన బిడ్డల కోసం పడిన తాపత్రయం అక్కడ ఉన్న వారిని కట్టిపడేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news