జగిత్యాలలో దారుణం.. ఓ ఇంటిపై 30 మంది యువకుల దాడి !

-

జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జగిత్యాల పట్టణంలోని ఓ ఇంటి పై మద్యం మత్తులో 30 మంది యువకులు దాడికి దిగినట్లు వార్తలు వస్తున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో ని వాణీ నగర్ కి చెందిన బింగి అనుదీప్ అనే యువకుడు ఇంటిపై పాత కక్షల నేపథ్యంలో దాడి చేశారట. జగిత్యాల పట్టణంలోని శ్రీరామ్ నగర్ కి చెందిన సందీప్ అనే యువకుడి గ్యాంగ్ దాడికి పాల్పడియినట్లు బాధితులు ఆరోపణలు చేస్తున్నారు.

సుమారు 30 మంది యువకులతో వచ్చి ఇంటి పై దాడి చేశారని బాధితులు చెబుతున్నారు. బింగి అనుదీప్, పవన్, రాజేశ్వరి, భీమక్క లపై దాడి చేసి ఇంట్లో ని వస్తువులు చిందర వందర చేశారని అంటున్నారు. దాడిలో ఒకరి తలకు తీవ్ర గాయాలయ్యాయని భాదితులు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలా నికి చేరుకుని విచారణ చేపడుతున్నారు పోలీసులు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరకు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news