ఏపీ మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసులు జారీ..!

-

ఆంధ్రప్రదేశ్ లో  వైసీపీ నేతలకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. సీఎం చంద్రబాబు నివాసం పై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కు మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే రెండు సార్లు జోగి రమేష్ విచారణకు హాజరైన విషయం విధితమే. తాజాగా మరోసారి మంగళగిరి డీఎస్పీ ఆధ్వర్యంలో ఆయనను విచారిస్తున్నారు.

ఈ కేసులో నిందితులుగా ఉన్న జోగి రమేష్, దేవినేని అవినాష్ లు తొలుత ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. వారి పిటిషన్ ను తిరస్కరించింది కోర్టు. ఈ నేపథ్యంలో వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో వారికి భారీ ఊరట లభించింది. వారిద్దరిపై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోకుండా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కానీ పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news