రేపటి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ స్పెషల్ క్యాంపులు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు అలర్ట్…ఏపీ ప్రభుత్వం ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో స్పెషల్ ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేస్తుంది. ఆగస్టు 22 నుంచి అంటే రేపటి నుంచి క్యాంపులు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 22, 23, 24, 25 తేదీల్లో మొత్తం నాలుగు రోజుల పాటు ప్రత్యేక క్యాంపులు నిర్వహించనుంది.

ఈ మేరకు తెలియజేస్తూ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ లక్ష్మీశా అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్నీ జిల్లాల గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఇన్ చార్జీలకు ఆదేశాలు జారీ చేశారు. ఆధార్ తీసుకున్న పదేళ్ల వ్యవధిలో కనీసం ఒక్కసారైనా తమ ఆదా వివరాలను అప్డేట్ చేసుకోవాలని యూఐడిఎఐ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో గత పదేళ్లుగా ఆధార్ అప్డేట్ చేసుకొని వారు తమ ఆధార్ కార్డును ఈ నాలుగు రోజుల్లో తమ దగ్గరలోని సచివాలయం క్యాంపులో అప్డేట్ చేసుకోవాల్సిందిగా సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news