నేటి నుంచి గ్రూప్ -2 దరఖాస్తుల స్వీకరణ

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని నిరుద్యోగులకు బిగ్‌ అలర్ట్‌. నేటి నుంచి గ్రూప్ -2 దరఖాస్తుల స్వీకరణ జరుగనుంది. ఆన్ లైన్‌లో దరఖాస్తుకు అవకాశం కల్పించింది ఏపీ సర్కార్‌. నేటి నుంచి జనవరి 10వ తేదీ వరకు గ్రూప్ -2 దరఖాస్తుకు అవకాశం కల్పించింది సర్కార్‌. 897 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీపీఎస్సీ.

Acceptance of Group-2 applications from today

ఏపీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ -2 నోటిఫికేషన్ ప్రకారం..ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566 ఉన్నాయి. ఫిబ్రవరి 25న ప్రిలిమనరీ పరీక్ష జరుగనుంది. దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్ సైట్: https://psc.ap.gov.in గా అధికారిక ప్రకటన చేసింది. అర్హతలు, రిజర్వేషన్లు వంటి అన్ని వివరాలతో సమగ్ర నోటిఫికేషన్ ను విడుదల చేసిన ఏపీపీఎస్సీ… నేటి నుంచి గ్రూప్ -2 దరఖాస్తుల స్వీకరణ జరుగనుందని ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news