జగన్ తో సెల్ఫీ దిగిన కానిస్టేబుల్ పై చర్యలు..!

-

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గా నిలిచిన వారిపైన చంద్రబాబు సర్కార్ చాలా కక్షపూరితంగా వ్యవహరిస్తోందని సమాచారం. తాజాగా జగన్మోహన్ రెడ్డి తో సెల్ఫీ దిగిన ఓ మహిళా కానిస్టేబుల్ పై వేటు వేసేందుకు… చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసిందట ఏపీ ప్రభుత్వం. గుంటూరు జిల్లా జైలు దగ్గర బుధవారం జగన్ తో.. ఓ మహిళ కానిస్టేబుల్ సెల్ఫీ దిగడం జరిగింది.

Action will be taken against the constable who took a selfie with Jagan

మహిళా కానిస్టేబుల్ ఆయేషా.. జగన్మోహన్ రెడ్డి తో సెల్ఫీ దిగడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీంతో… ఏపీ పోలీసులు సీరియస్ అయ్యారు. మహిళా కానిస్టేబుల్ పైన చర్యలు తీసుకుంటామని జైలర్ రవిబాబు కూడా ప్రకటించారు. దీనిపై చార్జీ మెమో ఇస్తామని కూడా వివరించారు. చార్జింగ్ ఏమో ఇచ్చిన తర్వాత ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకునేది… క్లారిటీ వస్తుందని జైలర్ రవిబాబు పేర్కొనడం జరిగింది. కాగా బుధవారం రోజున నందిగామ సురేష్ను.. పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news