రేపు బక్రీద్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముస్లిం ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు. రేపు బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులు, దూడలు, ఒంటెలను వధిస్తే జంతువుల సంరక్షణ చట్టాల ప్రకారం తప్పకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు హెచ్చరికలు జారీ చేశారు.

జంతు సంరక్షణ, గోవద నిషేధ చట్టాల ప్రకారం రాష్ట్రంలో వధపై నిషేధం ఉందని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులు జంతు వధ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చట్టాలను గౌరవించి స్వచ్ఛందంగా వధను నిషేధించాలని రాష్ట్ర పశువర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు కోరుతున్నారు. ముస్లిం ప్రజలు ఈ విధానాన్ని తప్పకుండా పాటించాలని ఆయన చెబుతున్నారు. దీనిపై ముస్లిం ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.