విజయదశమి నుంచే విశాఖ నుంచి పరిపాలన – జగన్

-

సచివాలయంలో ఏపీ క్యాబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్‌ అమలు బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రేపు అసెంబ్లీలో ఈ బిల్లుని ప్రవేశపెట్టనుంది. ఇక మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగి రిటైర్‌ అయిన సమయానికి ఇంటి స్థలం లేని వారికి కచ్చితంగా ఇంటిస్థలం ఉండాలన్నారు.

ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని స్పష్టం చేశారు. రిటైర్‌ అయిన తర్వాత కూడా ఉద్యోగులు, వారి పిల్లలు కూడా ఆరోగ్య శ్రీ కింద అందరూ కవర్‌ అయ్యేలా చూడాలన్నారు. రిటైర్‌ అయిన పిల్లల చదువులు కూడా ఫీజు రియింబర్స్‌ మెంట్‌ కింద ప్రయోజనాలు అందేలా చూడాలన్నారు. ఈమేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు క్యాబినెట్ తర్వాత మంత్రులతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దసరా పండుగ విశాఖలోనేనని స్పష్టం చేశారు. దసరా నుంచి విశాఖలోనే పాలన అంటూ సంకేతాలు ఇచ్చారు సీఎం జగన్. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు స్కామ్ లపై చర్చిద్దాం అన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాలను అందరూ సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ పై కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియదని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news