ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. 110 మున్సిపాలిటీల్లో ‘ఆహా’ క్యాంటీన్లు

-

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. గ్రామాల నుంచి దగ్గర్లోని పట్టణాలకు వచ్చే రైతులు, వ్యాపారుల ఆకలి తీర్చేందుకు, మహిళలకు ఉపాధి కల్పించేందుకు మోప్మా కార్యాచరణ సిద్ధం చేసింది. మొత్తం 110 మున్సిపాలిటీల్లో ‘ఆహా’ పేరుతో క్యాంటీన్లను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే కర్నూలు, కడప, ప్రొద్దుటూరులో ఏర్పాటు చేయగా… మంచి స్పందన వచ్చింది.

స్వయం సహాయ సంఘాల్లోని సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 13 వేల చొప్పున ప్రభుత్వం సాయం అందించనుంది. ఇక అటు ఏపీ ప్రజలకు సీఎం జగన్ అదిరిపోయే వార్త చెప్పారు. జగనన్న తోడు పథకం లో భాగంగా నాలుగో ఏడాది తొలి విడత కార్యక్రమాన్ని జగన్ ప్రభుత్వం రేపు నిర్వహించనుంది. 5.1 లక్షల మంది ఖాతాలలో పదివేల రూపాయల చొప్పున ఏకంగా 510 కోట్లను జమ చేయనుంది జగన్ సర్కార్.

Read more RELATED
Recommended to you

Latest news