జగన్ ధర్నాకు సంఘీభావం తెలిపిన ఆఖిలేష్ యాదవ్

-

జగన్ ధర్నాకు సంఘీభావం తెలిపారు ఆఖిలేష్ యాదవ్. ఈ సందర్బంగా జగన్‌తో కలిసి దాడుల వీడియోలను వీక్షించారు అఖిలేష్.. దాడుల ఘటనలను అఖిలేష్‌కి వివరించారు జగన్ మోహన్ రెడ్డి.

Akhilesh Yadav expressed solidarity with Jagan’s dharna

కాగా, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఏపీలో శాంతి భద్రతలు లోపించాయి. వందల ఇళ్లు ధ్వంసం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు. 1000కి పైగా అక్రమ కేసులు నమోదయ్యాయి. లోకేష్ రెడ్‌బుక్ పెట్టుకుని తనకు నచ్చని వారిపై కక్ష సాధిస్తున్నారు.’ అని జగన్ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news