ఏపీ ప్రజలకు అలర్ట్ : 3 రోజుల పాటు బయటకు రావొద్దు !

-

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. 83 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, మరో 157 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. శని, ఆది, సోమ వారాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో 46-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

అలాగే మరికొన్ని జిల్లాల్లో 43ని నుంచి 45, మరికొన్ని జిల్లాల్లో 40-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ మూడు వారాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో… ఏపీ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది. ఏపీ ప్రజలు ఎవరూ కూడా ఈ మూడు రోజులు బయటకు రావద్దని సూచనలు చేసింది. అత్యవసర పరిస్థితులు తలెత్తితే తప్ప.. బయటికి రా వద్దని కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news