తిరుమల భక్తులకు అలర్ట్..దర్శనానికి 24 గంటల సమయం

-

తిరుమల భక్తులకు అలర్ట్.. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండి బాట గంగమ్మ ఆలయం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న 63,628 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. హుండీకి రూ. 4.26 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

ఇక ఇటు తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ పాలక మండలి. ఇవాళ ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. ఇవాళ అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కేట్లను విడుదల చెయ్యనుంది. కళ్యాణోత్సవం, ఉంజల్ సేవా, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టిక్కేట్లు విడుదల చేయనున్న టిటిడి…ఈ నెల 24వ తేదిన అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టోకేన్లు విడుదల చెయ్యనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news