నిర్మల సీతారామన్ కు రాజ్యసభ సీటు ఇస్తే తప్పులేదా : చంద్రబాబుకు అంబటి కౌంటర్

-

టీడీపీ అధినేత చంద్రబాబు పై మరోసారి మండిపడ్డారు అంబటి రాంబాబు. చంద్రబాబుది అధికారం కోసం ఆరాటం అని అన్నారు. అధికారం లేకపోతే చంద్రబాబు పిచ్చెక్కిపోతారు అంటూ విమర్శించారు. 151 సీట్లు తెచ్చుకున్న వ్యక్తి అనర్హుడట.. 23 స్థానాలు మాత్రమే తెచ్చుకున్న తాను అర్హుడా అంటూ ఎద్దేవా చేశారు. అవకాశం దొరికితే దేశాన్ని నాశనం చేయగలిగే సత్తా ఉన్నవాడు చంద్రబాబు ఒక్కడే అంటూ విమర్శించారు అంబటి. రాయలసీమ లో తిరుగుతున్న చంద్రబాబు ఆ ప్రాంతానికి ఏం చేశారు..? అంటూ ప్రశ్నించారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ, ఈడీలు ఈ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి లేదు అని చెప్పిన విషయం చంద్రబాబు మర్చిపోయారా? అన్నారు. టికెట్లు అమ్ముకునే సామర్థ్యం ఉన్నవాడు చంద్రబాబు ఒక్కడే అని.. ఓటుకు నోటుతో కొని రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి పారిపోయి రాలేదా? అంటూ ప్రశ్నించారు.నీవు నిర్మలా సీతారామన్ కు రాజ్యసభ సీటు ఇస్తే తప్పు లేదు కానీ..మేము పక్క రాష్ట్రం వారికి ఇస్తే తప్పు వచ్చిందా అన్నారు.టీజీ వెంకటేష్ దగ్గర ఎంత తీసుకొని రాజ్యసభ టికెట్ ఇచ్చావు అన్నారు. నిర్మల సీతారామన్, సురేష్ ప్రభుకు రాజ్యసభ సీటు ఎందుకు ఇచ్చావు..? సుజనా చౌదరి, సీఎం రమేష్ మేధావులు అని రాజ్యసభకు పంపించావా.? అంటూ ఫైర్ అయ్యారు అంబటి రాంబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version