ఇవాళ విశాఖకు కేంద్రమంత్రి అమిత్‌ షా

-

కేంద్రమంత్రి అమిత్ షా ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా విశాఖలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. చెన్నై నుంచి సాయంత్రం 5:50 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. తిరిగి రాత్రి 9:30 గంటలకు బయలుదేరి ఢిల్లీ వెళ్తారు.

కాగా, నిన్న తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో ఏపీ బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపి సర్కారు అత్యంత అవినీతిలో కూరుకు పోయిందన్నారు. మైనింగ్, ఇసుక, లిక్కర్, ల్యాండ్, ఎడ్యుకేషన్ స్కాం లతో ఈ ప్రభుత్వం మునిగిపోయిందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. ‘ఏ స్కామ్ లు ఉన్నాయి అన్నిటి చేస్తోంది. ఇది సిగ్గు చేటు….ఏ ప్రభుత్వం చేయాని విధంగా వైసిపి అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపణలు చేశారు నడ్డా.

Read more RELATED
Recommended to you

Latest news