AP News : నేడు ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు

-

తెలుగు రాష్ట్రాల్లో గత రెండ్రోజులుగా వాతావరణం చల్లబడింది. తెలంగాణలో రెండ్రోజులుగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఏపీలోనూ ఎండ వేడిమి కాస్త తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో వర్షాలు పడే సూచనలున్నట్లు అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు తెలిపారు. ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంగళవారం రోజున శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి.

Read more RELATED
Recommended to you

Latest news