BREAKING : వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేసిన అనిల్ కుమార్ యాదవ్

-

నెల్లూరు నగరం వెంకటేశ్వరపురం లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేశారు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. నారా లోకేష్ ఆరోపించినట్లు తనకు ఆస్తులు లేవని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ… కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేయాలని… నేను చేశానని తెలిపారు. నాకు వెయ్యి కోట్లు ఆస్తులు ఉన్నాయని పత్రాలు విడుదల చేశారని… లేని ఆస్తులను నాకు అంటగట్టారని ఆగ్రహించారు.

వాటికి సంబంధించి పూర్తి వివరాలను ఇచ్చానని.. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆస్తులు నమ్ముకున్నానని తెలిపారు. ఇస్కాన్ సిటీలో నాకు 8 ఎకరాల భూమి ఉండేది ఇప్పుడు నాలుగు ఎకరాల భూమి మాత్రమే ఉందని.. నాకు ఏ రాష్ట్రంలో వ్యాపారాలు లేవు… ఇతర జిల్లాల్లో కూడా లేవన్నారు. నా నిజాయితీ నిరూపించుకునే అవకాశం లభించిందని.. నాకు వెయ్యి కోట్లు ఉందని ప్రచారం చేశారని పేర్కొన్నారు. ఈ ప్రచారం చూసి ఐటి శాఖ అధికారులు కూడా విచారణ చేస్తారేమో….వాళ్లు విచారణ చేసే క్లీన్ చిట్ ఇస్తే సంతోషమే అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఎవరిని శిక్షిస్తారో వచ్చే ఎన్నికల్లో చూద్దామని సవాల్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news