BREAKING : సాయిచంద్ భార్యకు కీలక పదవి ఇచ్చిన తెలంగాణ సర్కార్

-

BREAKING : సాయిచంద్ భార్యకు కీలక పదవి ఇచ్చింది తెలంగాణ సర్కార్. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ కీలక ప్రకటన చేశారు. కుసుమ జగదీష్ , సాయి చంద్ కుటుంబలకు మూడు కోట్ల రూపాయలు అందచేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు మంత్రి కేటీఆర్‌.

BRS ప్రజా ప్రతినిధులు వాళ్ల ఒక రోజు నెల జీతం ఇస్తారు…అన్ని కలిపి మూడు కోట్ల రూపాయలు అన్నారు. సాయిచంద్ బార్య రజనీకి తెలంగాణ రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియామకం చేస్తున్నట్లు స్పష్టం చేసింది మంత్రి కేటీఆర్‌.

కాగా, గాయకుడు సాయిచంద్ కుటుంబ సభ్యులను నిన్న పరామర్శించారు సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సాయిచంద్ నివాసానికి వెళ్లగానే ఎమ్మెల్సీ కవితను చూసి సాయిచంద్ భార్య బోరున విలపించింది. వారిని ఓదార్చే క్రమంలో కవిత సైతం భాగోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news