అన్నవరం భక్తులకు బిగ్ అలర్ట్..ఇక టీటీడీ తరహాలో స్పెషల్ !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నవరం సత్యనారాయణ స్వామి భక్తులకు బిగ్ అలర్ట్. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయానికి ఇవాళ తిరుమల నుంచి ప్రత్యేక అధికారులు వెళ్తున్నారు. టీటీడీ ఆ బృందానికి చెందిన కొంతమంది అధికారులు.. అన్నవరం టెంపుల్ కు వెళ్లి అక్కడ పరిస్థితులను పరిశీలించనున్నారు.

annavaram temple

అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రధాన ఆలయం పైన ఉండే విమాన గోపురానికి… బంగారు తాపడం చేయించాలని తాజాగా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ గోపురానికి బంగారం తాపడం చేయిస్తే ఎంత మేరకు ఖర్చు అవుతుంది..? దానికి కావాల్సిన పరికరాలు ఏంటి అనే దానిపైన టిటిడి అధికారులు అంచనా వేయనున్నారు.

ఇందులో భాగంగానే ఇవాళ అన్నవరం వెళ్ళనున్నారు టీటీడీ అధికారులు. అయితే ఈ బంగారం తాపడం చేయించడానికి… శ్రీకాకుళం చెందిన వెంకట రామకృష్ణ మూర్తి… గతంలో చాలాసార్లు ప్రభుత్వాలను కోరారు. కానీ ఏ ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బంగారం తాపడం చేయించడానికి అడుగులు పడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news