ఏపీ రైతులకు శుభవార్త…వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరల ప్రకటన

-

ఏపీ రైతులకు శుభవార్త…వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలను ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరల ప్రకటన పోస్టర్ ఆవిష్కరించారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు ఇకపై పంటకు గిట్టుబాటు ధర లభించిందన్న బెంగలేదని వెల్లడించారు. సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని.. సీజన్ ప్రారంభానికి ముందే మద్దతు ధరలు ప్రకటించారని చెప్పారు.

రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించాలన్నదే సీఎం ఆలోచన అని.. తొలిసారిగా రూ.3 వేల కోట్ల తో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ప్రతీ రైతు భరోసా కేంద్రాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చామని.. దళారుల ప్రమేయం లేకుండా రైతు భరోసా కేంద్రాల్లోనే..సీఎం యాప్ ద్వారా పంటలు కొనుగోలు చేస్తున్నామన్నారు. ఈ క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులు మంచి ధరలకు..పంటలు అమ్ముకోగలుగుతున్నారన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ప్రతీ రైతు భరోసా కేంద్రాల్లో ఈ మద్దతు ధరల ప్రకటన పోస్టర్లు ఉంటాయని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news