Breaking : ఏపీ హై కోర్టులో చంద్రబాబు మరో బెయిల్ పిటిషన్

-

ఏపీ హైకోర్టులో చంద్రబాబు మరో బెయిల్ పిటిషన్ దాఖలు వేశారు. ఫైబర్ గ్రిడ్ కేసులో బెయిల్ కోసం లంచ్ మోషన్ పిటిషన్ వేశారు చంద్రబాబు. ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా నారా లోకేష్ కూడా మరో రెండు కేసుల్లో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ , ఫైబర్ గ్రిడ్ కేసుల్లో పిటిషన్లు వేసిన లోకేష్.. అత్యవసరంగా విచారించాలని కోరారు. ఈ పిటిషన్లను మధ్యాహ్నం లంచ్ తరువాత విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. 

మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా  లోకేష్ పై ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్ మెంట్ వ్యవహారంపై గత ఏడాది నమోదు చేసిన కేసులో ఏ14గా ఆయన పేరును సీఐడీ ఇటీవలే చేర్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో లోకేష్ దాఖలు చేసిన పిటిసన్ పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించారు. లోకేష్ కి సీఆర్ఫీసీ 41 ఏ నోటీసులు ఇస్తామని.. దానికి సంబంధించిన నిబంధనలు పాటిస్తామని కోర్టుకు తెలిపారు. మరోవైపు కాసేపట్లో లోకేష్ కి సీఐడీ నోటీసులు సమర్పించనున్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news